రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
A government teacher died in a road accident

ముద్ర ప్రతినిధి మెదక్: రోడ్డు ప్రమాదంలోప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందగా స్వగ్రామం మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన పెద్దన్నోళ్ల పెంటయ్య(42) హవేలి ఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ నగర శివారులో గల పెంటయ్య రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తోటి ఉపాధ్యాయులు తెలిపారు.

మృతుడు పెంటయ్య భార్య సైతం చిన్న శంకరంపేట్ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. హైదరాబాద్ లో ఉపాధ్యాయుడు పెంటయ్య రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం బాధాకరమని, ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ గౌడ్, మండల బాధ్యులు సిద్దార్థ్ శంకర్ రావు, మహేష్, రవి, సిద్దిరాములు, వేణుగోపాల్, దేవదాస్ పేర్కొన్నారు.