మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా జి.రమేష్‌

మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా జి.రమేష్‌

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు)గా జి.రమేష్ బదిలీపై వచ్చారు. బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా ఉండి ఎన్నికల కమిషన్ సూచన మేరకు హైదరాబాద్ ఎస్జిడిసి -యూఎల్ సికి బదిలీకాగా ఈనెల 21న రిలీవ్ అయిన విషయం తెలిసిందే. మెదక్  స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ బదిలీ పక్షం రోజుల క్రితం బదిలీ అయ్యింది. అప్పటి నుండి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. జి.రమేష్ ను తిరిగి మెదక్ జిల్లాకు బదిలీ చేస్తు స్థానిక సంస్థల బాధ్యతలు అప్పగించారు.

మర్యాదపూర్వకంగా అడిషనల్ కలెక్టర్ రమేష్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాకు తిరిగి వచ్చిన రమేష్ ను జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుభాషిని, డీపీఓ సాయిబాబా, జిల్లా అధికారులు జయరాజ్, విజయ్ శేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, కమీషనర్ సాగర్, పలువురు ఎంపిఓలు మర్యాద పూర్వకంగా కలిశారు.