సీసీ డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి | Mudra News

సీసీ డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి | Mudra News

ముద్ర ప్రతినిధి, మెదక్: నిజాంపేట్ మండలం రాంపూర్ గ్రామంలో తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీపీ) నుంచి మంజూరు చేసిన రూ.5 లక్షల రూపాయల నిధులకు సంబంధించిన సీసీ డ్రైన్ పనులను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ పనుల ప్రారంభోత్సవం నిమిత్తం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి గ్రామ సర్పంచ్ జెల్ల రజిత లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రాచీన చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానన్నారు. రాబోవు ఆర్థిక సంవత్సరంలో మరో ఐదు లక్షలు రాంపూర్ గ్రామ అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. రాంపూర్ గ్రామానికి చెందిన స్వయం సహాయక బృందాల మహిళల కోరిక మేరకు గ్రామ సమాఖ్య భవనాన్ని ఇతర ప్రభుత్వ నిధుల నుంచి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. యువకులు తమ క్రీడా ప్రాంగణంలో క్రీడా పరికరాలు ఇప్పించాలని కోరగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పంజా విజయ్ కుమార్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, సర్పంచ్ లు శివ ప్రసాద్ రావు, నాగరాజు, ఎంపీటీసీ రాజా రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ లింగం, బీఆర్ఎస్ నాయకులు బాబు, తిరుపతి, ఉప సర్పంచ్ సంజీవులు, మల్లేష్ యాదవ్, రంజిత్ రాజ్, తదితరులు ఉన్నారు.