సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ

 బాన్సువాడ, ముద్ర: బాన్సువాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో బుధవారం నాడు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబాస్ రాములు మాట్లాడుతూ సిపిఐ పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా బిజెపి కో హఠావో... దేశ్కో బచావో  నినాదంతో ఇంటింటికి సిపిఐ, ప్రజల వద్దకు సిపిఐ పేరుతో ప్రచారం నిర్వహిస్తామని అందులో భాగంగా ఈ నెల 25వ తేదీన బాన్సువాడ పట్టణ కేంద్రంలో ర్యాలీ, సభ ఉంటుందని ఆయన తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆయన తెలిపారు కొద్దిమంది పెట్టుబడుదారుల కొరకే బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ధరలను కట్టడి చేయడంలో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ కోటగిరి మండల కార్యదర్శి ఏ విటల్ గౌడ్, పుట్టి సాయిలు, గంపల సాయిలు, కే సాయిలు, జే భూమయ్య, షాపూద్దీన్, మారుతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు