మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన స్పీకర్ పోచారం, ప్రజా ప్రతినిధులు

మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన స్పీకర్ పోచారం, ప్రజా ప్రతినిధులు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో బాన్సువాడ నియోజక వర్గం బి ఆర్ ఎస్ పార్టీ శాసన సభ్యుడు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు కొత్తగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కలిశారు.

ఈ సందర్భంగా కేసీఆర్   పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.మాజీమంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, దానం నాగేందర్ తదితరులు మాజీ సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు.