కాంగ్రెస్ పార్టీలో చేరిన ముత్తారం బీఆర్ఎస్ యూత్ సభ్యులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన ముత్తారం బీఆర్ఎస్ యూత్ సభ్యులు

కండువగప్పి పార్టీలోకి ఆహ్వానించిన నాగినేని జగన్మోహన్ రావు

ముద్ర ముత్తారం :ముత్తారం మండల కేంద్రంలోని 10 మంది బీఆర్ఎస్ యూత్ సభ్యులు మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండలం మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్ మోహన్ రావు, ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ, సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ లో్ చేరారు. పార్టీ లో చైరిన వారికి కండువా కప్పి పార్టీ నాగినేని తో పాటు సర్పంచ్ లు సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచులు తాటిపాముల ఒకల రాణి శంకర్ రాపల్లి రామన్న కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపిటిసి మల్యాల రాజయ్య, ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.