ఈవిఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్

ఈవిఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కేంద్రాల్లో ఉన్న ఈవీఎంల, వివి ప్యాడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరు ను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకుడు సాయిబుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.