ఘనంగా ఎమ్మెల్యే గండ్ర జన్మదిన వేడుకలు
మొగుళ్లపల్లి, ముద్రన్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రోజున భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి 58వ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా మొగుళ్ళపల్లి జెడ్పిటిసి జోరుక సదయ్య ఎంపీపీ యారా సుజాత సంజీవరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు చదువు అన్నా రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా జడ్పిటిసి జోరుక సదయ్య మాట్లాడుతూ..
భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భూపాలపల్లి ప్రజల దీవెనలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని వారి దీవెనలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోటే ధర్మారావు, స్థానిక ఎంపిటిసి ఎర్రబెల్లి వనిత పున్నం చందర్రావు, సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షులు దానవేణ రాములు, సొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మంద సుధాకర్, రైతు సమన్వయ కమిటీ జిల్లా డైరెక్టర్ దండ వెంకటేశ్వర రెడ్డి, సర్పంచులు బెల్లంకొండ మాధవి శ్యాంసుందర్ రెడ్డి , నరహరి పద్మ వెంకటరెడ్డి ,నైనా కంటి ప్రభాకర్ రెడ్డి, గూడెపు శ్రీనివాస్, పాశం స్వరూప పర్వతాలు, కో ఆప్షన్ నెంబర్ మహమ్మద్ రహీం , ఎంపీటీసీలు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు , పార్టీ అనుబంధ నాయకులు, గండ్ర అభిమానులు ,పార్టీ సీనియర్ నాయకులు , యూత్ నాయకులు పాల్గొన్నారు