శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న- గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్
![శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న- గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6454ba5637aa2.jpg)
మొగుళ్లపల్లి, ముద్ర న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి మొగులపల్లి మండలం పెద్ద కోటిపల్లి గ్రామంలోని గౌడ కులస్తుల ఆరాధ్య దేవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించగా గౌడ కులస్తుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తుల ఇంటి ఇలవేల్పు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు గౌడ కులస్తులపై ఉండాలని, గ్రామ ప్రజలను చల్లగా చూడాలని ఆయన వేడుకున్నారు.
ఆయన వెంట గౌడ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర రమేష్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు తడక సుధాకర్ గౌడ , గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బుర్ర శ్రీధర్ గౌడ్, జిల్లా నాయకులు పెరుమండ్ల రవీందర్ గౌడ్, గడ్డం సదానందం గౌడ్, పెరుమండ్ల తిరుపతి గౌడ్, మల్లయ్య గౌడు, గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం రాజు గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు బిక్షపతి గౌడ్, గౌడ కులస్తులు పాల్గొన్నారు.