విఓఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఐకేపీ విఓఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని బీజేపీ కామారెడ్డి సెగ్మెంట్ ఇంచార్జి కాటిపల్లి వెంకట్ రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఐకేపీ విఓఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక మెరుపు సమ్మె శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి మద్దతు పలికారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18వేల మంది VOA లు చేస్తున్న ధర్నా కార్యక్రమానికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని, వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చలని అన్నారు.