రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీ కొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో జరిగింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం 44వ నెంబర్ జాతీయ రహదారిపై మంచిప్ప రిజర్వ్ అటవీ ప్రాంతంలో జరిగడంతో కలకలం రేగింది.
నిజామాబాద్ కామారెడ్డి రహదారిపై దగ్గి _చాంద్రాయణ పల్లి అటవీ ప్రాంతంలోని రహదారి పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారి వెంట వెళ్తున్న ప్రయాణికులు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.