బాల్యవివాహాలను రూపుమాపాలి: కలెక్టర్

బాల్యవివాహాలను రూపుమాపాలి: కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: బాల్య వివాహాలను రూపుమాపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం బాల రక్షా భవన్ కన్వర్జేషన్ మీటింగ్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న అనాధ పిల్లల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు సేకరించాలని సూచించారు. అనాధ పిల్లలకు ధ్రువీకరణ పత్రం వచ్చిందా లేదా తెలుసుకోవాలని తెలిపారు. అనాధ పిల్లలు వసతి గృహాల్లో ఉండి ఉన్నత విద్యను పూర్తిచేసే విధంగా అధికారులు చూడాలని పేర్కొన్నారు. ఎవరైనా పిల్లలను భిక్షాటన చేయిస్తే వారిని పట్టుకుని చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జిల్లా బాలల అభివృద్ధి అధికారిని స్రవంతి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.