ఎండోమెంట్ మినిస్టర్ కి ఆహ్వానం

ఎండోమెంట్ మినిస్టర్ కి ఆహ్వానం

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 14న నిర్వహించే పెద్ద జయంతి ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని మంగళవారం కలిసిన ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు. ఆలయ ఈవో టంకశాల వెంకటేష్, సూపరిoడేoట్ సునీల్, ఫౌండర్ ట్రష్టి మారుతి, వేద పండితులు  హైదరాబాద్ వెళ్లి మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ముందుగా మంత్రిని శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం పెద్ద జయంతికి ఆహ్వానం పలికినట్లు అధికారులు తెలిపారు.