108 అంబులెన్స్ లో కవల పిల్లలు ప్రసవం తల్లి బిడ్డలు క్షేమం
![108 అంబులెన్స్ లో కవల పిల్లలు ప్రసవం తల్లి బిడ్డలు క్షేమం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64511c286a646.jpg)
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గ్రామానికి చెందిన కనుక కౌశల్యకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ సమాచారమిచ్చారు.సిబ్బంది ఈఎంటి కృష్ణ, పైలట్ వెంకటేశ్వర్ ల ఇప్పమాడకు వెళ్లి గర్భిణీ నిర్మల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటి కృష్ణ సహకారంతో మగ బిడ్డ జన్మించాడు తర్వాత 20 నిమిషాలకు, ఆడబిడ్డ కూడా జన్మించింది.తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. తల్లి బిడ్డలను నిర్మల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేర్చారు .