రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన

రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దిలావర్ పూర్ మండలంలో ఆదివారం  పలు కార్యక్రమాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. బన్సపల్లి నుండి దిలావర్ పూర్ తండా మీదుగా లోలం బిటి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్ నిర్మాణానికి రూ. 2.80 కోట్లు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కలెక్టర్ వరుణ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.