బండి సంజయ్...నోరు అదుపులో పెట్టుకో....!

బండి సంజయ్...నోరు అదుపులో పెట్టుకో....!
  • స్పీకర్ ను విమర్శిస్తే నాలుక చీరేస్తాం                                                   
  • పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చేలాగాటమా?                     
  • డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి                                                      

బాన్సువాడ, ముద్ర: ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ, అభివృద్ధి యే ధ్యేయంగా పనిచేస్తున్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని విమర్శిస్తే నాలుక చీరేస్తామని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బిజెపి చీఫ్ బండి సంజయ్ ను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం బాన్సువాడ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.  రాజకీయ లబ్ది కోసం పేపర్లు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చేలాగాటమాడుతూ, చిల్లర రాజకీయాలు చేస్తున్న బండి సంజయ్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తన కొడుకును అదుపులో పెట్టుకోలేని బండి, స్పీకర్ పోచారంను విమర్శించడం తగదన్నారు. ఎంపీగా ఉన్నప్పటికీ ప్రోటోకాల్ తెలియని నీకు, ప్రభుత్వ కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ గా హాజరవడం తప్పుగా భావిస్తున్నావా అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టగా, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక్కటన్న అమలవుతోందా అని ప్రశ్నించారు. కుటుంబ పాలన బీజేపీలో ఉందని, అమిత్ షా కుటుంబం మొత్తం వివిధ పదవులను అనుభవిస్తోందని అన్నారు. స్పీకర్ పోచారం నిజాయితీ, నిబద్ధత గల నాయకుడని అన్నారు. మరోసారి స్పీకర్ ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, బాన్సువాడ లో నిర్బంధిస్తామని భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు అంజిరెడ్డి, ఎజాస్, మోహన్ నాయక్, పాత బాలకృష్ణ, దొడ్ల వెంకట్రామిరెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.