టెన్త్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

టెన్త్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( బాలుర ), లయోలా హైస్కూల్లోని 10వ తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు.   పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లోని వసతులను పరిశీలించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు.