ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
బాన్సువాడ,ముద్ర: బాన్సువాడ రూరల్ మండలం బోర్లం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో బోర్లం,జక్కల్ దానితాండ లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
ప్రారంభోత్సవంలో బోర్లం సొసైటీ చైర్మన్ డీసీసీబీ డైరెక్టర్ సంగ్రామ్ నాయక్,మార్కెట్ కమిటీ చైర్మన్ నేర్రే నర్సింలు,ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాత బాలకృష్ణ,నాయకులు గోపాల్ రెడ్డి, వెంకట్ రాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,దేవేందర్ రెడ్డి, సర్పంచులు సరళ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు శ్రావణి దేవేందర్ రెడ్డి,రతన్,సుధాకర్ రెడ్డి ,ప్రజాప్రతినిధులు, నాయకులు,రైతులు పాల్గొన్నారు.