గ్రామ గ్రామాన బీజేపీ కి పెరుగుతున్న మద్దతు

గ్రామ గ్రామాన బీజేపీ కి పెరుగుతున్న మద్దతు
  • అవినీతి రహిత కామారెడ్డి బీజేపీ లక్ష్యం
  • కబ్జా కోరుల  ఆగడాల నుండి కామారెడ్డి నీ కాపాడాలంటే బీజేపీ కి ఓటు వెయ్యాలి
  • కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన 56 మంది బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీ లో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు అని, తమ ఆత్మగౌరవాన్ని ప్రగతి భవన్ కి తాకట్టు పెట్టరు అని అన్నారు.  గ్రామ గ్రామాన ప్రజలు బీజేపీ కి పెరుగుతున్న మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. గత 30 సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోలేదు అని అన్నారు.  ప్రజలు అవినీతి రహిత కామారెడ్డి బీజేపీ లక్ష్యం అని, కబ్జా కోరుల  ఆగడాల నుండి కామారెడ్డి నీ కాపాడాలంటే బీజేపీ కి ఓటు వెయ్యాలనీ విజ్ఞప్తి చేశారు.