లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
ముద్ర యాదగిరిగుట్ట :యాదాద్రి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి శివాలయం నందు శ్రీ దేవిశరన్నవరాత్రోత్సవములలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీ లలిత అష్టోత్రం, శ్రీ లలిత సహస్రనామార్చన ,పారాయణములు, జపములు, కుంకుమార్చన నిర్వహించారు.