ఎరుకల నాంచారమ్మ తల్లి ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి 

ఎరుకల నాంచారమ్మ తల్లి ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి 

భూదాన్ పోచంపల్లి, ముద్ర న్యూస్ :  భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలోని ఎరుకల నాంచారమ్మ తల్లిని గురువారం  జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి దర్శించుకున్నారు. నాంచారమ్మ గుడి నిర్మాణం పనులను  పరిశీలించి మే 1 నుండి 5 వరకు జరిగే  జాతరకు అని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జాతర పోస్టర్ ను, ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.


కార్యక్రమంలో తహసిల్దార్ వీరాబాయి, గ్రామ సర్పంచ్ హరీష్, ఎం.పి.టి.సి. లక్ష్మణ్,  ఉప సర్పంచ్ సతీష్, రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షులు కుతాడి రాములన్న,  జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షులు కుతాడి సురేష్, తదితరులు పాల్గొన్నారు.