విపత్తులో ఆదుకున్న వారికి అవార్డులు

విపత్తులో ఆదుకున్న వారికి అవార్డులు

ముద్ర ప్రతినిధి కామారెడ్డి: విపత్తు నిర్వహణలో విశేష కృషి సల్పిన వ్యక్తులు, సంస్థల నుండి సుభాష్ చంద్రబోస్ ఆపద  ప్రబంధన్ పురస్కార్ అవార్డులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆన్ లైన్ లో దరఖాస్తులు వల్ల కలిగేవిపత్తు నిర్వహణలో అద్భుతమైన పనితీరు కనబరచిన వ్యక్తులకు,సంస్థలకు భారత ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డు ను అందిస్తున్నదని అన్నారు. అవార్డుకు ఎంపికైన వ్యక్తులకు,సంస్థలకు మూడు నగదు బహుమతులు అందజేస్తుందని జిల్లా కలెక్టర్ పాటిల్ తెలిపారు. 

2024 సంవత్సరానికి   సుభాష్ చంద్రబోస్ ఆపద  ప్రబంధన్ పురస్కార్ అవార్డు కు అర్హులని భావించిన వ్యక్తులు లేదా సంస్థలు https://awards.gov.in వెబ్ సైట్ నందు ఆన్ లైన్ లో ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు  ఆ వెబ్ సైట్ ను సందర్శించాలని  కలెక్టర్ పాటిల్ సూచించారు.