కామారెడ్డి జిల్లాలో కొత్త మండలం ఏర్పాటు

కామారెడ్డి జిల్లాలో కొత్త మండలం ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో పాల్వంచ గ్రామాన్ని మండలం గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో మొత్తం 24 మండలాలు అయ్యాయి. గత ఏడాది ఆగస్టు లో పాల్వంచ ను మండలం గా ప్రకటిస్తూ గెజిట్ జారీ చేయగా, ప్రస్తుతం ఉత్తర్వులు వెలువడ్డాయి.కొత్త మండలం లో మాచారెడ్డి కి చెందిన కొన్ని గ్రామాలు, రామారెడ్డి మండలానికి చెందిన గ్రామాలు ఉన్నాయి. కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ మండలం లో త్వరలో తహసీల్దార్, ఎంపిడిఓ, పోలీసు స్టేషన్ తదితర మండల కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.