తిరుమలను దర్శించుకున్న స్పీకర్ పోచారం

తిరుమలను దర్శించుకున్న స్పీకర్ పోచారం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం  తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. సతీమణి పోచారం పుష్ప, కుమారుడు, DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోని రెడ్డి, మనుమలతో కలిసి ప్రత్యేక దర్శన సమయంలో స్వామి వారిని సభాపతి పోచారం దర్శించుకున్నారూ. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ..కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని, తిరుమల పరమ పవిత్రమైనదని అన్నారు.మొక్కు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చానని,లోక కళ్యాణం ముఖ్యం. ప్రజలందరూ సుఖసంతోషాలతో, చల్లగా ఉండాలని దేవున్ని కోరుకున్నానని తెలిపారు.తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, మాకు పరిపాలించే శక్తి ఇవ్వాలని దేవున్ని కోరుకున్నానని,వర్షాలు బాగా కురిసి, పంటలు పండి, సుభిక్షంగా ఉంచే విదంగా  ఆశీర్వదించాలని దేవున్ని ప్రార్ధించానని తెలిపారు.