ప్రశాంత మెదక్ లో గొడవలు సృష్టించొద్దు

ప్రశాంత మెదక్ లో గొడవలు సృష్టించొద్దు
  • మెదక్ ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్:ప్రశాంత మెదక్ నియోజకవర్గంలో గొడవలు సృష్టించొద్దని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ పట్టణం ఔరంగాబాద్, ఆవుసులపల్లిలో ప్రచారం నిర్వహించారు. 2009 నుండి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మెదక్ నుండి పారిపోయిన మైనంపల్లి హన్మంత్ రావుకు 13 ఏళ్ళ తర్వాత గుర్తొచ్చిందన్నారు.

మనం జై తెలంగాణ అంటే ఆయన నై తెలంగాణ అన్నాడని ఆరోపించారు. సంకల బిడ్డను తీసుకొని వస్తుండు, వయసుకు గౌరవం ఇవ్వలేని సంస్కారం హీనుడిగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 11సార్లు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే కెసిఆర్ పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కర్ణాటక మాదిరి అంటే 5 గంటల కరెంటు ఇస్తారా అని ప్రశ్నంచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఎఎంసి చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు కిషోర్, కొర్వి వేదవతి రాములు, కొట్టాల విశ్వం, మామిళ్ళ ఆంజనేయులు, వసంత్ రాజ్, పట్టణ అధ్యక్షులు గంగాధర్, నాయకులు అశోక్, బొద్దుల కృష్ణ, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.