సొసైటీ షాపింగ్ కాంప్లెక్స్, జిపి భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు

సొసైటీ షాపింగ్ కాంప్లెక్స్, జిపి భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేళిఘనాపూర్ మండలం బూరుగుపల్లిలో పాక్స్ ఆధ్వర్యంలో రూ.37 లక్షల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు,  గాజిరెడ్డిపల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనము రూ.20 లక్షల వ్యయంతో నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సిహెచ్.హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ సూర్యతేజ, ఆత్మ కమిటీ చైర్మన్ అంజగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్.

శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ లు చెన్నా గౌడ్, యామిరెడ్డి, సాప భాగ్యలక్ష్మి శ్రీనివాస్, కిషన్, ఎంపీటీసీ అర్చన శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాప సాయిలు, పిఎసిఎస్ డైరెక్టర్లు, రామ్ రెడ్డి సిద్ధిరాంరెడ్డి, నారాయణరెడ్డి విజయ్, రాములు, నాయకులు బిక్షపతి రెడ్డి, సిద్ధిరాం రెడ్డి, సాయగౌడ్, నార్ల సాయిలు, దుర్గారావు, మేకల సాయిలు, రామచంద్ర రెడ్డి, బాల్ రాజ్,  హనుమంత్ రెడ్డి, రవీందర్ గౌడ్, సాప శ్రీనివాస్, భీమయ్య దాససు, రవి, పోచయ్య, శ్రీనివాస్ తదితరులున్నారు.