ఆలయాన్ని అభివృద్ధి చేస్తా.. ఎమ్మెల్సీ కడియం

ఆలయాన్ని అభివృద్ధి చేస్తా.. ఎమ్మెల్సీ కడియం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాలలో మాచర్ల కుటుంబీకులు నిర్వహిస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి ఉత్సవాలలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మంగళవారం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ప్రహరీ గోడ, గేటు, సీసీ పనులతో పాటు ఇతర వసతులు కల్పించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆయన వెంట మండల వైస్ ఎంపీపీ సరిత నరసింహ, గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, ఎంపీటీసీ ఉమా సమ్మయ్య, రాజవరం ఎంపీటీసీ లలిత శ్యాం కుమార్ రెడ్డి, నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బెలిదే వెంకన్న, బుర్ల శంకర్, స్వామి నాయక్, రజాక్ యాదవ్, తాళ్లపల్లి వెంకటయ్య, తాళ్లపల్లి జగన్నాథం, ఇల్లందుల సుదర్శన్, గజ్జల దామోదర్, జనగామ యాదగిరి, అశోక్ బాబు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.