ఎర్రబెల్లి ఓ ఊసరవెల్లి - అల్లం ప్రదీప్‌రెడ్డి | Mudra News

ఎర్రబెల్లి ఓ ఊసరవెల్లి - అల్లం ప్రదీప్‌రెడ్డి | Mudra News
  • రేవంత్‌రెడ్డి విమర్శించే అర్హత ఆయనకు లేదు
  • కాంగ్రెస్‌ జిల్లా నేత అల్లం ప్రదీప్‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌ రావు ఊసరవెల్లిలా పార్టీలు మారుతూ.. ఎందులో ఉంటే ఆ పాట పాడుతున్నాడని కాంగ్రెస్‌ జిల్లా నేత అల్లం ప్రదీప్‌రెడ్డి విమర్శించారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిపై దయాకర్‌‌ రావు చేసిన కామెంట్‌కు ప్రదీప్‌రెడ్డి కౌంటర్‌‌  ఇచ్చారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మేడారం నుంచి ప్రారంభమైన రేవంత్‌ రెడ్డి పాదయాత్ర ఊరూరా సమ్మక్క జాతరలా కొనసాగుతుందన్నారు. దీనిని చూసి ఓర్వలేని అధికార పార్టీ లీడర్లు తమ నేతపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీరించారని ఆరోపించారు. గతంలో సీఎం కేసీఆర్‌‌ ‘నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా’ అన్నాడని అప్పడు ఆయనపై పీడీ యాక్ట్‌ పెడితే ఇప్పుడు తమ నేతపై కూడా పెట్టాలన్నారు. అభివృద్ధిపై ఉపన్యాసాలు ఇస్తున్న దయాకర్‌‌ రావు అసలు మంత్రిగా జనగామ జిల్లాకు, పాలకుర్తి నియోజకవర్గానికి చేసిందమైనా ఉంటే చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌‌ వద్ద చేతులకట్టుకుని మంత్రి పదవి తెచ్చుకున్న ఎర్రబెల్లి ఇక్కడి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. మరోసారి రేవంత్ రెడ్డిపై కానీ కాంగ్రెస్‌ పార్టీపై కానీ విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.