కడియం రోడ్ షోలు అదుర్స్

కడియం రోడ్ షోలు అదుర్స్

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఎన్నికల ప్రచార చివరి రోజు మంగళవారం నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రోడ్ షోలు అదుర్స్ అన్నట్టుగా నిర్వహించారు. శివునిపల్లి, చాగల్లు, నమలిగొండ, ఇప్పగూడెం, తాటికొండ, స్టేషన్ ఘన్ పూర్ గ్రామాల్లో మహిళలు, అభిమానులు, పార్టీ శ్రేణులు వేల సంఖ్యలో తరలి రావడం రోడ్ షోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

స్థానిక మోడల్ కాలనీలో కడియం కూతుర్లు కావ్య, రమ్మల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీజేలు, డప్పు చప్పులు, కోలాటాల తో భారీ ర్యాలీలు నిర్వహించే ఓటర్లను ఆకర్షించారు. కార్యక్రమంలో బుర్ల లతా శంకర్, తోట సత్యం, పాతి కుమార్, గుర్రం రాజు, కృష్ణారావు, రజాక్ యాదవ్, మూటం ప్రభాకర్, రాపోలు మధుసూదన్ రెడ్డి, చల్ల సుధీర్ రెడ్డి, పొన్న శ్రీనివాస్, పాగాల సారంగపాణి, కనకం గణేష్, చేపూరి వినోద్ కుమార్, మంద రాజు, పల్లె రవి, రాములు, రామ నరసయ్య, రత్నాకర్ రెడ్డి, పరశురాములు, చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బెల్డ వెంకన్న, నీరటి ప్రభాకర్, జీడి ప్రసాదు, జీడి రమేష్, స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.