కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం కాకులు చింపిన విస్తరే ...

కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం కాకులు చింపిన విస్తరే ...

బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం కాకులు చింపిన విస్తరేనని, బిఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రానికి భవిష్యత్తు, భద్రత ఉంటుందని బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక శివాజీ సెంటర్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో

అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, మూడు గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు, 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుచేసి సొంత భవనాన్ని నిర్మించడం, గృహలక్ష్మి కింద 500 ఇండ్ల నిర్మాణం, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల నరేందర్ రెడ్డి, సర్పంచ్ సురేష్ కుమార్, ఎంపిటిసిలు రాజు, గన్ను నరసింహులు, చేపూరి వినోద్ కుమార్, మునిగల రాజు, బక్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు.