మాజీ జర్నలిస్ట్ హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి...

మాజీ జర్నలిస్ట్ హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి...

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మాజీ జర్నలిస్ట్ హత్య కావడంతో  తీవ్రంగా ఖండించిన జోగులాంబ గద్వాల జిల్లా జర్నలిస్టులు

గత రెండు రోజుల క్రితం షాద్నగర్ పట్టణానికి చెందిన మాజీ జర్నలిస్ట్ కరుణాకర్ రెడ్డి. కిడ్నాప్ అనంతరం హత్య చేసిన అంతకులను ఎంత వారైనా కఠినంగా శిక్షించాలని జోగులాంబ గద్వాల జిల్లా జర్నలిస్టులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ హత్యకు గురైన మాజీ జర్నలిస్ట్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జోగులాంబ టీవీ సీఈఓ,బి.గిరిబాబు, ముద్ర కె.వెంకటేశ్వర్లు, నరేష్ ఈనాడు, శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రజ్యోతి, రంగమని,కిరణ్ సాక్షి, వెంకటేష్ ఆంధ్రజ్యోతి, ఇస్మాయిల్ జనంసాక్షి, నందు ప్రైమ్ నైన్,రజినీకాంత్ దిశ, వర్మ సూర్య, మా టీవీ  కృష్ణ, కిషోర్ సిక్స్ టీవీ, సహదేవులు న్యూస్ నైన్, రాముడు విశ్వజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.