ప్రజావాణికి 7 ఫిర్యాదులు

ప్రజావాణికి 7 ఫిర్యాదులు

జోగుళాoబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఈరోజు ప్రజావాణి (ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం) సందర్భంగా జిల్లా లో  వివిధ ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి 7 ఫిర్యాదులు రావడం జరిగింది.  పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఓపిక తో విన్న  జిల్లా ఎస్పీ కె. సృజన, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా ఆయా సర్కిల్ ఇన్స్పెక్టర్ లకు, ఎస్సై లకు ఆదేశించడం అయినది. అలాగే సివిల్ ఫిర్యాదులను కోర్టులోనే పరిష్కరించుకోవలసిందిగా వారికి సూచించడమైనది.

మరియు ప్రజలు తీసుకు వచ్చిన ఫిర్యాదులపై చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేకూర్చే ఏ ఫిర్యాదులను కూడా పెండింగ్ లేకుండా చూడాలని ఎస్పీ. అధికారులను ఆదేశించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్- 100 కి కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.