మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈ రోజు తెల్లవారు జామున 5 గంటలకు ధరూర్ మండలం పార్చర్ల స్టేజి సమీపంలో ఆటోను ఢీకొట్టిన బొలెరో వాహనం. ఆటోలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందరు తల్లి జములమ్మ 50, కుమారుడు అర్జున్ 24, కోడలు వైశాలి 22, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గద్వాల టౌన్ 7వ వార్డు దౌధర్ పల్లి చెందిన వీరు ముగ్గురు ఒకటే కుటుంబ సభ్యులు, ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగినది. వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.
ఎమ్మెల్యే వెంట ఎంపీపి విజయ్,వార్డు కౌన్సిలర్ విష్ణుప్రియ దౌలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.