జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉదృత్తి

జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉదృత్తి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ధరూర్ మండల సమీపంలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది.గురువారం జలాశయానికి 4, 400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 4.41 టిఎంసిల నీరు నిల్వ ఉంది. రెండు రోజుల వ్యవధిలో 1.74 టీఎంసీల వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరినట్లు వారు వివరించారు. జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో జూరాల వాటర్ గ్రిడ్, ఇతర త్రాగునీటి పథకాలకు నీటి కొరత ఉండదని వారు తెలిపారు..