లస్సీస్ ప్లస్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలోని ధరూర్ మెట్టు సమీపంలో లస్సిస్ ప్లస్ షాపు ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. షాప్ యజమాని ఎమ్మెల్యే ని పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. లస్సి షాపులోని తయారీ విధానాన్ని ఎమ్మెల్యే పరిశీలించడం జరిగింది. లస్సి షాప్ యజమానిని ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ విజయ్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ శీను, నరహరి గౌడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గద్వాల తిమ్మప్ప, రిజ్వాన్, శ్రీరాములు ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.