ప్రతి కార్యకర్తకు అండగా వుండే పార్టీ బిఆర్ఎస్ పార్టీ

ప్రతి కార్యకర్తకు అండగా వుండే పార్టీ బిఆర్ఎస్ పార్టీ
MLA Bandla Krishnamohan Reddy

 కార్యకర్తలే పార్టీకి బలం బలగం

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :  బిజెపి - కాంగ్రెస్ పార్టీలు  ప్రజలకు చేసింది ఏమి లేదు  పేదలకు సాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పేదలు, రైతుల కోసం పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  మల్దకల్ మండలం ఆత్మీయ సమ్మేళన సమావేశం ఈరోజు గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.   మండల పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కి  పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్. ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పార్టీలకతీతంగా ప్రతి గడపగడపకు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తు  మృతి చెందితే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్న దేశంలో ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.  నేడు మల్దకల్ మండలం అన్ని గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు రావడం జరుగుతుంది.  వ్యవసాయ రంగానికి  24 గంటల కరెంటు, రైతులకు రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు, కెసిఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు వంటి నగదు బదిలీ పథకాలతో పాటు  సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, స్మశాన వాటికలు వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తో పాటు మన ఊరు -మనబడి  మండలంలో పాఠశాలలను మౌలిక వసతులు కల్పిస్తూ ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. వివిధ అభివృద్ధి పనులకు ద్వారా మల్దకల్ మండలంలో సుమారు 363 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశామని వివరించారు.


బీజేపీ పార్టీ పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతంలో అధికారంలో ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు కర్ణాటక ప్రాంతంలో అమలు కావడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు  గ్రహించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్. పుట్టిన బిడ్డ నుంచి చావుకు కాలు చాపే వృద్ధుల వరకు అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, దళారి వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దళితుల కోసం సీఎం కేసీఆర్. దళిత బంధు పథకం ప్రవేశపెట్టి  దళితులు ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ  ఆత్మ గౌరవంగా  జీవించాలని దళిత బంధు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్. అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర ప్రాంతాల ప్రభుత్వాలు వారి రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం  రైతులపై సవతి ప్రేమ చూపించడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ విషయాలను గ్రహించాలని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో వివిధ రకాల వేషాలతో గ్రామాలలో వచ్చి కులాల, మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి మీరు. వారు చెప్పిన మాటలు వింటే అభివృద్ధిలో మన గ్రామాలు మరో 20 సంవత్సరాలు వెనక్కి పోతుందని,  కాబట్టి తప్పుడు మాటలు వినకుండా వారి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్తులో  తగిన బుద్ధి చెప్పాలి. బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సీఎం కేసీఆర్ ని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. నాపై కూడా మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ రాజారెడ్డి జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, పాక్స్ ఛైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపి వీరన్న, ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాద రావు,  మండలం పార్టీ అధ్యక్షుడు వెంకటన్న,సింగిల్ విండో వైస్ చైర్మన్ విష్ణు, మండలం సర్పంచులు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి,  సర్పంచ్ యాకోబు, వివిధ గ్రామాల సర్పంచులు,  ఎంపీటీసీ, కో ఆప్షన్  బిఆర్ఎస్ పార్టీ నాయకులు సత్య రెడ్డి, సీతారాం రెడ్డి, విక్రమ్ సింహరెడ్డి, శేషం పల్లి నరసింహులు, తూం కృష్ణ రెడ్డి, అజయ్, రమేష్ రెడ్డి, నరసింహారెడ్డి, రామచంద్ర రెడ్డి ఆంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి, నరేందర్, మధు నాయకి,  జనార్దన్ రెడ్డి, భాస్కర్ గౌడ్,  మహబూబ్ ఆలీ, చక్రధర్ రెడ్డి, కురుమన్న,  వెంకటేశ్వర్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నర్సింహులు, పరుశురాముడు, బద్రి, మండలం యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.