ప్రజావాణి కార్యక్రమానికి 15 ఫిర్యాదులు: జిల్లా ఎస్పీ

ప్రజావాణి కార్యక్రమానికి 15 ఫిర్యాదులు: జిల్లా ఎస్పీ

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :గద్వాల్: శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి  పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పని చేస్తుందని, బాధితులకు అండగా ఉంటు  ఫిర్యాదుల పై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని. జిల్లా ఎస్పీ కె. సృజన అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన 15 ప్రజా ఫిర్యాదులను  జిల్లా ఎస్పీ స్వీకరించారు.  ఈ సందర్భంగా ఎస్పీ ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ, పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను  ఎస్పీ ఆదేశించారు.  పిర్యాదు దారులు  సివిల్ వివాదాలను కోర్టులోనే పరిష్కరించుకో వలసిందిగా వారికి సూచించారు.
బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ  చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో 
భూ వివాదాలకు సంబంధించి -09 ఫిర్యాదులు.

మిస్సింగ్ కు సంబందించి- 02 పిర్యాదులు.
గొడవలకు సంబంధించి - 01 పిర్యాదు.
సైబర్ క్రైమ్ కు సంబంధించి -01 పిర్యాదు.
ఇతర అంశాలకు సంబంధించి -02 పిర్యాదులు.