టి యస్ పి యస్ సి లో రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. నైతిక బాధ్యత వహించి సీఎం కెసిఆర్ రాజీనామా చెయ్యాలి.
టి యస్ పి యస్ సి. ప్రస్తుత బోర్డ్ ను రద్దు చేసి కొత్త బోర్డ్ ఏర్పాటు చెయ్యాలి.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ:
- కేసీఆర్ విద్యార్థుల కళ్ళలో మట్టి కొట్టారు.
- ఒక్కో విద్యార్థి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎగ్జామ్ రద్దు చేస్తున్న అని కేసీఆర్ తప్పించుకుంటున్నారు
- కెసిఆర్ కి రాజకీయాలు తప్ప తెలంగాణ ప్రజలపై కేసీఆర్ కి పట్టింపు లేదు. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.
- తెలంగాణ యువత బరిగీసి కొట్లాడాలి.
- ప్రభుత్వ మెడలు వంచుదాం.
- అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని
- ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది
- కేసీఆర్ ఆరాటం అంతా కుర్చీ పైనే ఉంది
- పెన్ డ్రైవ్ లో పేపర్లు దొంగిలిస్తే టి యస్ పి యస్ సి. ఎం చేస్తుంది.
- సీసీ కెమెరాల ఎందుకు పనిచేయడం లేదు.
- రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.
- పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. నైతిక బాధ్యత వహించి సీఎం కెసిఆర్ రాజీనామా చెయ్యాలి.
- టి యస్ పి యస్ సి ప్రస్తుత బోర్డ్ ను రద్దు చేసి కొత్త బోర్డ్ ఏర్పాటు చెయ్యాలి.
- విద్యార్దులు మనోదైర్యం కోల్పోవద్దు.