ఇందువాసి గ్రామంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ఇందువాసి గ్రామంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామంలో నాయిని లక్ష్మయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం. తన వ్యవసాయ పొలంలో రోజు మాదిరిగానే వెళ్లి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన చంపినట్టు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు అక్కడ చేరుకున్న పోలీసులు డాగ్స్ తో సందర్శిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.