అనేక సంక్షేమ పథకాల అమలు
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల నియోజకవర్గం గట్టు మండలం పరిధిలోని ఆరగిద్ద గ్రామంలో ఎస్సీ, గట్టు మండల కేంద్రం గంగిమాన్ దొడ్డి గ్రామం బీసీ, ఎస్సీ, మైనార్టీ ఫంక్షన్ హాల్స్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రతి గ్రామంలోని పేద ప్రజలు వివాహ శుభ కార్యాలు జరుపుకోవడానికి కమ్యూనిటీ ఫంక్షన్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ విజయ్, పాక్స్ ఛైర్మన్ వెంకటేష్, రైతు బంధు సమితి అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఇమామ్ సాబ్, తదితరులు పాల్గొన్నారు.