అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తాం ప్రజాపంథా నేతలు

అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తాం ప్రజాపంథా నేతలు
We will fight unceasingly prajapandha leaders

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రజా సమస్యల సాధన కోసం సిపిఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటాలునిర్వహిస్తామని పార్టీ నేతలు తెలిపారు. ప్రజాపందా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన పార్టీ జెండాల ఆవిష్కరించి సభలు నిర్వహించారు. సభలలో వక్తలు మాట్లాడుతూ  ప్రజా ఉద్యమాల నిర్మాణంతో ప్రజా పందా మార్గంలోనే జనతా ప్రజాతంత్ర విప్లవం సాధ్యమవుతుందని  అన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకులు, జాటోత్ క్రిష్ణ అన్నారు. దేశంలో అశేష ప్రజానికాన్ని విప్లవోద్యమంలో మమేకం చేసి ప్రజాసంఘాల నిర్మాణం తో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు.

ప్రజానీకాన్ని విప్లవోద్యమంలో మమేకం చేయాల్సిన బాధ్యత విప్లవ పార్టీ ప్రజాపందా భుజస్కంధాలపై వేసుకుంటుందని అన్నారు. సమాజ స్థాపనకై విప్లవం విజయవంతంకై ప్రజలందరూ ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం కావలసిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ పెట్టుబడి దారి సమాజ వికృత విధానాల మూలంగా నిరుద్యోగ సమస్య తీవ్రమైందని అన్నారు. మారుతున్న పరిస్థితుల కనుగుణంగా ఎత్తుగడలు,పందాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి నూతన ప్రజాతంత్ర విప్లవ సాధనకై ప్రజాపందా పార్టీ తన ఎత్తుగడలను పందాలను ప్రజా చైతన్యంతో ఉద్యమిస్తుందని ఈ మార్గంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపందా నాయకులు గుమ్మడి నరసయ్య, కెచ్చెల రంగారెడ్డి, చండ్ర అరుణ, కల్పన మాచర్ల సత్యం, రాము, ముద్ద భిక్షం, జాటోత్ కృష్ణ, నాయనిరాజు తదితరులు పాల్గొన్నారు.