శ్రీశ్రీశ్రీ శివ ఆంజనేయులు స్వామి నూతన దేవాలయం ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే

శ్రీశ్రీశ్రీ శివ ఆంజనేయులు స్వామి నూతన దేవాలయం ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈరోజు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని  ఉప్పేర్ గ్రామంలో నూతన శ్రీశ్రీశ్రీ శివ ఆంజనేయస్వామి దేవాలయం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి, హాజరయ్యారు.గ్రామస్తులు, ఎంపీటీసీ ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.శ్రీ శ్రీ శ్రీ శివ ఆంజనేయ స్వామి నూతన  దేవాలయంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే.దేవాలయంలో ప్రతిష్టించి చేసే విగ్రహాలు లకు ఎమ్మెల్యే  ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.

ప్రతి గ్రామంలో దేవాలయాలు ఉండడంవల్ల ప్రజలలో భక్తి శ్రద్ధలతో  దేవుని గ్రామ పూజించడం వల్ల  శాంతి నెలకొల్పే గ్రామంలో  అందరూ కలిసి మెలిసి ఉండాలి  అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు కావాలి ఆ దైవ అనుగ్రహం తో రాష్ట్రం, గద్వాల, ఉప్పేర్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు. గ్రామంలోని ప్రజలందరికీ అన్ని విధాలుగా రైతులకు అభివృద్ధి చెందాలి పాడి పరిశ్రమ పరంగా అన్ని రంగాలలో గ్రామం అభివృద్ధి చెందాలి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగినది తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరూర్ మండల వైస్ ఎంపీపి సుదర్శన్ రెడ్డి, ఎంపిటీసి రేణుక, మండల సర్పంచ్లు సంఘం అధ్యక్షుడు రఘు వర్ధన్ రెడ్డి, అల్లపాడు  సర్పంచ్ వీరన్న గౌడ్,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, సర్వారెడ్డి, ప్రభాకర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, నరేష్ గౌడ్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.