ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే తలంబ్రాలు

ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే తలంబ్రాలు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల: శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణానికి నేరుగా హాజరుకాని వారికి ఆర్టీసీ సువర్ణ అవ కాశం కల్పిస్తోందని మంగళవారం డీఎం శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ కార్గో లాజిస్టిక్స్ ద్వారా భక్తుల ఇంటికే తలంబ్రాలను అందించే కార్యక్రమం నిర్వహించబడుతుంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి దేవాదాయ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో చేపడుతున్న ఈ ఆధ్యాత్మిక పేజీ. 116లు చెల్లించి వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది నేరుగా శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటికి తెచ్చి ఇస్తారని చెప్పారు. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పృథ్వీరాజ్ సెల్ నెంబర్ 9154298609 ను సంప్రదించాలన్నా