ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు.
గద్వాల: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగాయి. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీగా నిర్వహించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు మొత్తం 238 మంది విద్యార్థులు హాజరుకాగా 8 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9గంటల నుం చి 12గంటల వరకు జరిగిన ప్రాక్టికల్స్కు 238 మంది విద్యార్థులకు 226 మంది హాజరుకాగా 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
ల్యాబుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాలను గద్వాల జిల్లా ఇంటర్ నోడల్ అధికారి హృదయ రాజు, డిఈసీ నెంబర్లు దేవేందర్ రెడ్డి, రమేష్ లింగం, గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జీ.వీరన్న, కళాశాల అధ్యాపకులు హరికృష్ణ, మహేష్ పర్యవేక్షించారు.