ఈనెల 25వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో నిరుద్యోగ మార్చ్

ఈనెల 25వ తేదీన మహబూబ్ నగర్  జిల్లాలో నిరుద్యోగ మార్చ్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఉమ్మడి జిల్లాలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మధ్యాహ్నం మూడు గంటలకు  మహబూబ్ నగర్  టిటిడి కళ్యాణ మండపం నుండి గడియారం చౌరస్తా వరకు నిరుద్యోగ మార్చ్  ఉండును.. ఈ రోజు గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా లో నిరుద్యోగ మార్చ్ సన్నాక సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణమ్మ. హాజరయ్యారు. ఈ సందర్భంగా డికె. అరుణమ్మ మాట్లాడుతూ.

ప్రతి పోలింగ్ బూత్ నుండి బూత్ స్థాయి నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాలని అన్నారు. నిరుద్యోగ మార్చ్  వల్ల కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైంది.. వచ్చే ఎన్నికల్లో బి ఆర్ యస్ పార్టీ ని  బొంద పెట్టడానికి నిరుద్యోగులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళ కుటుంబమే బాగుపడింది తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు  వచ్చింది లేదు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ బతుకులు మారుతాయి అనుకున్నారు.

కానీ వాళ్ళ పరిస్థితి మారింది లేదు. మంత్రి కేటీఆర్ వైఫల్యం వల్ల టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన లక్షలాది మంది అభ్యర్థులు రోడ్డున పడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, జిల్లా ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, జిల్లా సహా ఇంచార్జ్ వీరేంద్ర గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం క్రిష్ణ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, రాష్ట్ర ఓబీసీ మోర్చా  అధికార ప్రతినిధి నాగేందర్ యాదవ్, కౌన్సిలర్ రజక జయశ్రీ తదితరులు ఉన్నారు.