ఈద్గా వద్ద రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన

ఈద్గా వద్ద రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద అతిపవిత్రమైన రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య. పాల్గొన్నారు. అనంతరం జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి,మనలో కొత్త ఉత్సాహాన్ని అల్లాహ్ ప్రసాదించాలని ఆకాంక్షించారు.వీరి వెంట శ్రీనాథ్ రెడ్డి. జైపాల్ రెడ్డి. బి.ఆర్.ఇమ్మానేయిల్. ధరూర్ రవి. కృష్ణ. ఎల్లప్ప. గణేష్ తదితరులు ఉన్నారు.