గద్వాల ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ జేఏసీ అధ్యాపకులు

గద్వాల ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ జేఏసీ అధ్యాపకులు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ని పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించి స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపిన రెగ్యులరైన గద్వాల జేఏసీ అధ్యాపకులు. డా". బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కెసిఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని జూనియర్ అధ్యాపకులు 45, డిగ్రీ 10, పాలిటెక్నిక్ 9, మంది అధ్యాపకులు రెగ్యులర్ అయ్యారు. ఈ శుభ సందర్భంగా రెగ్యులర్ అయిన అధ్యాపకులు తమ జీవితకాలం మొత్తం సీఎం కేసీఆర్ కి కేటీఆర్ కి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి రుణపడి ఉంటామని వీరు మా పాలిట ప్రత్యక్ష దేవుళ్ళని ఆనందం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బోరవెల్లి పవన్ కుమార్, నరసింహులు, శేఖర్, కాశీ విశ్వనాథ్, శ్రీనివాసులు, కే భాస్కర్, హరి నాగభూషణ్, సురేష్, శ్రీమతి గీత, రాజయ్య, రవి, రాములు, తదితర అధ్యాపకులు  పాల్గొన్నారు.