స్వచ్ఛమైన ఇందిరమ్మ పాలనను నిర్మిద్దాం

స్వచ్ఛమైన ఇందిరమ్మ పాలనను నిర్మిద్దాం
  • అవినీతి టిఆర్ఎస్ ను పారద్రోలుదాం
  • అన్ని వర్గాల ప్రజలను ఆదరించేది కాంగ్రెస్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : అయిజ మండలంలో కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో  "సంపత్ కుమార్". అయిజ మండలంలో కొనసాగుతున్న  హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఈరోజు ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్, మెడికొండ, తుపత్రాల గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై చేయి చేయి కలుపుతూ  ప్రతి గడపను తట్టుతు అడుగు ముందుకేస్తున్నారు.ఈ సందర్భంగా సంపత్ కుమార్, ప్రతి గడపను తట్టుతూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బి ఆర్ యస్ పార్టీ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారాన్ని దక్కించుకొని ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కా రణి టిఆర్ఎస్ పై సంపత్ కుమార్ విరుచుకుపడ్డారు. మూడు ఎకరాల భూమి ఇస్తామని. డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని, రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. ఇక పై మోసపోవద్దని ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ నిర్వర్తిస్తుందని తెలియజేస్తూ ప్రతి వారి సమస్యలను తెలుసుకుంటూ వారి కష్టాలకు భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో రాబోయేది, రైతు రాజ్యమని,ఉత్సాహం నింపారు,