జిల్లా పోలీస్ కార్యాలయం కు  ప్రజవాని ద్వారా 10 ఫిర్యాదులు

జిల్లా పోలీస్ కార్యాలయం కు  ప్రజవాని ద్వారా 10 ఫిర్యాదులు

జోగులంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి:  శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి  బాధితులకు అండగా ఉంటూ  ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ. కె.సృజన, అన్నారు.  సోమవారం  జిల్లా పోలీస్  కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యల పై బాధితుల నుండి వచ్చిన 10 అర్జిలను  జిల్లా ఎస్పీ. స్వీకరించారు.  ఈ సందర్భంగా ఎస్పీ. ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ ల  అధికారులతో మాట్లాడుతూ పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను  ఎస్పీ. ఆదేశించారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. అలాగే చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల, మహిళలకూ వ్యతిరేకంగా జరిగే నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ. అధికారులను ఆదేశించారు.

ఈ రోజు వచ్చిన పిర్యాదులలో 
భర్త వేదింపులకు సంబందించి 01 పిర్యాదు.
భూ వివాదాలకు సంబందించి 06 పిర్యాదులు.
చీటింగ్ కు సంభందించి 02 పిర్యాదు.
ఇతర అంశాలకు సంబంధించి 01 పిర్యాదు.