అగ్ని ప్రమాదానికి గురైన జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

అగ్ని ప్రమాదానికి గురైన జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. అగ్నిప్రమాదంలో కంప్యూటర్లు, ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ కార్యాలయ ప్రాంగణం వెళ్లి పరిశీలించడం జరిగినది. జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి తో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.  ఎవరో గుర్తు తెలియని దుండగులు కార్యాలయం తాళాలు పగులగొట్టి కావాలని ఈ పని చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ జరిపించి కారణమైన వారికి వెంటనే శిక్షించాలని పోలీస్ వారికి సూచించారు.


ఎమ్మెల్యే వెంట కె.టి దొడ్డి మండల వైస్ ఎంపీపి రామకృష్ణ నాయుడు, ధరూర్ మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు రఘవర్ధన్ రెడ్డి, మల్డకల్ మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారి శ్యామ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.